Gomatha Mahathmyam - గోమాత మాహాత్మ్యం
1. గోవు పాదము -
పితృదేవతలు, 2. పిక్కలు - పిడుగంటలు, 3. అడుగులు - ఆకాశగంగలు, 4. ముక్కోలు కొలుకులు - ముచ్చిన చిప్పలు, 5. కర్రి - కర్రేనుగ, 6. పొదుగు -
పుండరీకాక్ష, 7. సన్ను కట్టు - సప్తసాగరాలు, 8. గోవుమయం - శ్రీలక్ష్మీ, 9. పాలు -
పంచామృతాలు, 10. తోక - తొంభై కోటి ఋషులు, 11. బొడ్డు -
పొన్నపువ్వు, 12. కడుపు - కైలాసం, 13. కొమ్ములు - కోటిగుల్లు, 14. మొగముదెష్ట, 15. వెన్ను - యమధర్మరాజు, 16. ముక్కు - సిరి, 17. కళ్ళు - కలువరేకులు, 18. చెవులు - శంఖనాదం, 19. నాలుక -
నారాయణ స్వరూపం, 20. దంతములు - దేవతలు, 21. పళ్ళు - పరమేశ్వరి, 22. నోరు - లోకనిధి.
1. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, 2. దేవేంద్రుని భార్య శచీదేవి, 3. శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, 4. శ్రీరాములవారి భార్య సీతాదేవి, 6. ఈశ్వరుని భార్య పార్వతీదేవి, 5. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి, 7. వశిష్టుల వారి భార్య అరుంధతీదేవి, వీరంతా కలిసి ప్రాతఃకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును
పోవును కృష్ణా? అని అడిగినారు.
ప్రొద్దుటే లేచి గోవు మాహా త్మ్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన
పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసి తెలియక చేసిన పాపములు అంతా కూడా పరిహారము.
మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణా! అంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు.
అర్ధరాత్రివేళ పఠిస్తే ఏమిటి కృష్ణా! అంటే యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవు మాహాత్మ్యము పఠించిన పణతి
వస్తుంది. ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది. కనకాంబరాలతో కదులుతూ తులాభారాలతో తులతూగుతూ తన భర్తను
తలచుకోని తన పుత్రపుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్ర బంధువుల ననుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా
వచ్చినది.
ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షింతలు, గంధములు యిచ్చి
కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్క కాకులను వెనక్కు త్రోసేసి, మండే మండే పెనాలను క్రిందకు దింపేసి - అనిసి కాశి, గయ, ప్రయోగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది. విన వారికి విష్ణులోకము, చెప్పినవారికి పుణ్యలోకము.