దీపావళి రోజున దీపాలు వెలిగించవలసిన ఎనిమిది
పవిత్ర స్థానాలు
లక్ష్మిదేవి — సంపదకు, వైభవానికి, ఆనందానికి మూలం. ఆమె అడుగుపెట్టిన ఇంట్లో దారిద్ర్యం చేరదు.
దీపావళి రోజున
లక్ష్మిదేవి భూమిని దర్శించడానికి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే దీపావళి రోజు
ఆమెకు స్వాగతం పలుకుతూ ఇంటిని శుభ్రపరిచి పూలతో, దీపాలతో అలంకరిస్తారు.
అమావాస్య -
చీకటి రాత్రి కూడా ఆ వెలుగులతో ప్రకాశమానమవుతుంది.
దీపావళి అంటే — చీకటిపై కాంతి విజయం సాధించడం.
లక్ష్మిదేవి మీ ఇంటిలో
స్థిరంగా నివసించాలంటే, పూజ అనంతరం ఈ ఎనిమిది
ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి:
ఇంటి ప్రధాన ద్వారం వద్ద:
లక్ష్మిదేవి ఇంట్లోకి
ప్రవేశించే ప్రధాన ద్వారం ఇది. పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి.
ధాన్యాగారం (స్టోర్ హౌస్ లో):
ఆహార (బియ్యం, ధాన్యం, ఇతర
ఆహార పదార్ధాలు) నిల్వ ఉంచే ప్రదేశం కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆహార సమృద్ధి
కలుగుతుంది.
డబ్బు ఉంచే స్థలంలో:
సంపద స్థిరంగా ఉండటానికి
దీపావళి రాత్రి డబ్బులు ఉంచే ప్రదేశంలో
దీపం వెలిగించాలి.
వాహన సమీపంలో:
దీపం వెలిగించడం వల్ల
ప్రమాదాలు దూరమవుతాయి. మీ ప్రయాణానికి వాహనానికి భద్రత కలుగుతుంది.
నీటి వనరుల వద్ద (బావి, కుళాయి, బోరు, మోటర్ మొదలైనవి):
జలతత్త్వం పవిత్రం. నీటి
వనరుల వద్ద దీపం వెలిగించడం జీవన శక్తిని పెంచుతుంది.
గుడి లేదా పూజగది:
దేవతామూర్తుల అనుగ్రహం
లభిస్తుంది, దివ్య శక్తి ఇంట్లో
ప్రవహిస్తుంది.
తులసి చెట్టు వద్ద:
తులసి చెట్టు లక్ష్మీదేవి
స్వరూపం. ఇక్కడ దీపం వెలిగించడం అత్యంత మంగళప్రదం. శుభప్రదం.
రావి చెట్టు వద్ద:
రావిచెట్టులో 33 వర్గాల
దేవతలు నివసిస్తారని నమ్మకం. విష్ణువు స్వయంగా నివసించే చెట్టు కూడా రావి చెట్టు
ఇది.
నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు?
దీపావళి — నరకాసురుని వధకు చిహ్నం. కానీ అతని కథలో లోతైన జీవనబోధ కూడా
దాగి ఉంది.
నరకాసురుడు విష్ణుమూర్తి
(వరాహస్వామి) మరియు భూదేవి కుమారుడు.
అతను సంధ్యవేళలో పుట్టాడు
— అది జ్ఞానం (పగలు) మరియు అజ్ఞానం (రాత్రి) కలిసిన సమయం.
మంచి లక్షణాలు ఎన్ని
ఉన్నా, ఒక్క చెడు లక్షణం చాలు — జీవితం నాశనం అవుతుంది.
రావణుడు - జ్ఞాని అయినా
అహంకారంతో నశించాడు.
మహిషాసురుడు - బలవంతుడు
అయిన మదంతో నశించాడు,
నరకాసురుడు - కామం, మదం, క్రోధంతో
నశించాడు.
భూదేవి తన కుమారుడిని
చంపకూడదని కోరినా,
కానీ సత్యభామ రూపంలో తానే
అతనిని సంహరించాల్సి వచ్చింది.
తన సద్గుణాలు
నిలుపుకోకపోతే, దేవుని పుత్రుడైనా
నశిస్తాడని ఈ కథ హిత బోధిస్తుంది.
చెడు స్నేహం — నరకాసురుని అంతానికి మూలం.
బాణాసురుడి చెడు
సాంగత్యంతో నరకాసురునిలో ఉన్న రాక్షస ప్రవృత్తి మేల్కొంది.
అతను మునులను అవమానించాడు, దేవతలను దూషించాడు, కామంతో
రాజకుమార్తెలను చెరపట్టాడు.
అంతిమంగా సత్యభామ చేతిలో
తన అంతం చూసాడు.
జీవన బోధ:
ప్రహ్లాదుడు - రాక్షసుని
కడుపున పుట్టినా దేవుడిగా మారాడు.
నరకాసురుడు - దేవుని
కడుపున పుట్టినా రాక్షసుడయ్యాడు.
మన గుణమే మన గమ్యం.
మన సాంగత్యమే మన శాపం
లేదా ఆశీర్వాదం.
దీపావళి అంటే వెలుగు
మాత్రమే కాదు — అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు
విజయం సాధించడం.
లోకా సమస్తా సుఖినో భవంతు
శుభ దీపావళి!