కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!
కార్తీకమాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట
వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.
ఈ నెల శివుడు,
విష్ణువులు పూజ కొరకు చాలా
పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు,
వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్ |
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ ||
న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః ||
అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో
రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.
ఈ కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే.
ఈ కార్తీకమాసం అంతట నదీ స్నానం, దీపారాధన,
దీపదానం, సాలగ్రామ పూజ, ఉపవాసం,
వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు.
ఈ మాసంలో రాత్రులలో దేవాలయాలందు ఉదయం సాయంత్రం లేదా తులసి
దగ్గర దీపాలు వెలిగిస్తారు.
ఈ కార్తీకమాసం మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో
తెలుసుకుందాం.
కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి,
గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేట్టుగా
అనుగ్రహించమని ప్రార్థించి,
సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని
సందర్శించుకోవాలి.
విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: అమ్మవారికి కుంకుమ పూజలు చేయాలి.
చవితి: నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని
పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి: దీన్ని జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈ రోజున
సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి: ఈ రోజున బ్రహ్మచారికి ఎర్ర గడులు గల కండువాను దానం
చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.
సప్తమి: ఎర్రని వస్త్రంలో గోధుమలును పోసి దానం ఇస్తే
ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి: ఈరోజున గోపూజ చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.
దీన్ని గోపాష్టమి అని అంటారు.
నవమి: నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర
వ్రతాన్ని ఆచరించాలి.
దశమి: నేడు రాత్రిపూట విష్ణువుకు పూజ చేయాలి.
ఏకాదశి: ఈ ఏకాదశిని బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణువుకు
పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి: ఈ రోజు సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి: పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
కార్తీక పౌర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అత్యంత అతి
పవిత్రమైన రోజు. ఈ రోజున నదీస్నానం చేసి,
శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే
సర్వపాపాలూ తొలగిపోతాయి.
కార్తీక బహుళ పాడ్యమి: ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ: వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ: పండితులు,
గురువులకు తులసి మాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి: రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద
పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం మరియు శునకాలకు అన్నం పెట్టడం
మంచిది.
షష్ఠి: ఊరిలో గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి: జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి: కాలభైరవ అష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి
కలుగుతుంది.
నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి: అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి: ఈ రోజు విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం,
పఠనం, జాగరణ చేస్తే
మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం
కలుగుతుంది.
త్రయోదశి: ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు ఉంటె
తొలగిపోతాయి.
చతుర్దశి: ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య: పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక
బాధలు తొలగుతాయి.
ఓం శాంతి: శాంతి: శాంతి: