శని త్రయోదశి - త్రయోదశి వ్రతం ఎలా చేయాలి? శని భగవానుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి ?
శనిదేవుడు అంటే చాలా మంది
భయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. శని అంటే చెడు చేస్తాడు అనే భయం
అందరిలో ఉంది. కానీ శని అనుగ్రహిస్తే
ఐశ్వర్యం, అభివృద్ధి, పెళ్లిళ్లు, ఇలా
అన్ని ఇస్తాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే
నీతి, న్యాయం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ
దృష్టి ఉన్నవారు భక్తితో శనీశ్వరుని కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి
కీడు చేయకుండా కాపాడుతాడు.
శని త్రయోదశి అంటే
శనివారం రోజున తిధి త్రయోదశి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి
వారిని నువ్వులతో, నూనేతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది.
శనీశ్వరునికి అభిషేకాలు
ఎలా చేయాలి. నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి తెలుసుకుందామా..!
శనీశ్వరునికి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య , కోర్టు
కేసులు, శత్రువులు, ఋణ బాధలు నుంచి విముక్తి చేయాలని మొక్కుకుని నియమాలు
పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో, వస్త్ర, ధన, వస్తు రూపంలో కాని ధాన
ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి
వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ
వస్రాన్ని ధానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి. దానలు అనేది
ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది.
త్రయోదశి వ్రతం:-
నిజానికి శని భగవానుడిని
మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి
శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని
శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
శనీశ్వరుడు
సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన
గోత్రం. సోదరుడు యమధర్మరాజు, సోదరి
యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త, పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద, పిప్పలా, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
ఈ శని త్రయోదశి అంటే
శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ
ఫలితాలను అందించేవాడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు
పాటించాలి.
ఉదయాన్నే నువ్వుల నూనేతో
ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.
ఆ రోజు మద్యం, మాంసం ముట్టరాదు.
వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
" నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం "
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.
వీలైనంత వరకు ఏపని
చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.
అందరిలోను అంటే ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.
జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.
ఎవరితోను వాదనలకు దిగరాదు.
ప్రతి రోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.
ఆరోజు ఆకలితో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను, భవ బంధాలను మరువరాదు.
అత్త మామలకు, వంట చేసి వడ్డించిన వారిని, మన మేలు కోరేవారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.
ఉదయం సూర్యోదయం కాగనే
శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని
అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
మూగ జీవులకు ఆహార పదార్ధాలను, నీటిని ఏర్పాటు చేయాలి.
కాకులకు బెల్లంతో చేసిన
రొట్టెలను నువ్వుల నూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.
అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదోక రూపంగా సహయపడాలి.
ఈ విధంగా వ్యవహరించ
గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో
నిలబెడతాడు.
ఓం శం శనైశ్చరాయ నమః